Sunday, May 5, 2024

Crime: మహిళ దారుణహత్య.. గొంతు కోసి, కాళ్లు నరికి ఆపై..

ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. దుండగులు మహిళ గొంతు కోసి కాళ్లను శరీరం నుంచి వేరు చేశారు. ములుగు మండలం బండమైలారంలో ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలిని గజ్వేల్‌ ఏసీపీ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దారుణ హత్యకు గురైన మహిళను వెంకటమ్మ (40) గా గుర్తించారు. వెంకటమ్మ ప్లాస్టిక్‌ సామాగ్రి అమ్ముతూ జీవనం కొనసాగిస్తుండగా.. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకటమ్మ భర్త గతంలో మృతిచెందారు. కాగా, వెంకటమ్మను హత్య చేసిందెవరు ? హత్యకు గల కారణాలేంటి ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement