Tuesday, May 14, 2024

జ‌న‌గామ ఇండస్ట్రియల్ ఏరియాలో దారుణ హత్య.. క‌త్తితో మెడ న‌రికి చంపేశారు

జనగామ జిల్లాలో దారుణం జ‌రిగింది. జిల్లా కేంద్రం, హనుమకొండ రోడ్డులో ఉన్న‌ ఇండస్ట్రియల్ ఏరియా గురుద్వార్ ఎదురుగా ప్రధాన రహదారిపై ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఈ ఘ‌ట‌న నిన్న (మంగళవారం) అర్ధరాత్రి జరిగింది. అంబేద్కర్ నగర్ కు చెందిన పగడాల సందీప్ అనే వ్యక్తి.. ఫకీర్ సురేష్ ను కత్తితో మెడ న‌రికి చంపిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు.

సందీప్, సురేష్, మరో వ్యక్తి కలిసి హత్య జరిగిన ప్ర‌దేశానికి ద‌గ్గ‌ర్లోనే మద్యం తాగారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో సందీప్ అనే వ్య‌క్తి సురేష్ ను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. మద్యం తాగిన‌ ముగ్గురిలో ఒకరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి హత్యకు సంబంధించిన సమాచారం అందించారు. వెంటనే సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన సందీప్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు కుటుంబ తగాదాలతోపాటో మ‌రేదైనా కార‌ణం ఉందా అనే కోణంల పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement