Friday, May 3, 2024

ఒకరు దొంగ… మరోకరు బ్రోకర్… మిగతా వారు దద్దమ్మలు.. కాంగ్రెస్ పై బి ఆర్ ఎస్ ఫైర్

నల్గొండ లో కాంగ్రెస్ నేతల విమర్శలకు మునుగోడు ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నల్గొండ కాంగ్రెస్ నేతలు సన్నాసులు… చవటలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని ఆయన మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక బ్రోకర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకట్ రెడ్డి ఉప ఎన్నికల్లో తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కోసం పనిచేశారు అంటూ తెలిపారు. కాంగ్రెస్ లో అందరూ సీఎంలే.. ఒక్కరూ కూడా ప్రజల్లో గెలవరు అంటూ వెల్లడించారు. కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ లు వేల ఎకరాల భూమితో పుట్టినారా అంటూ మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు జోకర్లుగా మారారు అంటూ ఎమ్మెల్యే సైదిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతలు పోటీ చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ లు కూడా రావంటు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులకు సభ్యత, సంస్కారం లేదని సైదిరెడ్డి అన్నారు. వాళ్ళను ఓడించడానికి మేము అవసరం లేదు.. వాళ్ళే ఒడించుకుంటారు అని హుజుర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు.. వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి కాంగ్రెస్ నేతలకు.. వాళ్లు కావాలని ఇల్లు కట్టుకోలేదు అని ఆయన ఆరోపించారు

రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నల్గొండ ప్రజలు నాలుక కోస్తారు అంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. రేవంత్ ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో రేవంత్, ఉత్తమ్ పై విమర్శలు చేశారు అని గాదరి కిషోర్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా అంటే పారిపోయిన దొంగ జానారెడ్డి అంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement