Sunday, April 28, 2024

TS : సీఎంను క‌లిసిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం.. కాంగ్రెస్‌లోకి ముహుర్తం ఖ‌రారు..!

భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో కుటుంబసభ్యులతో సహా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెల్లం వెంకట్రావుతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా ఉన్నారు.

కాగా, భద్రాచలం భారాస ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నారు అనే వార్తలు గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఆ వార్తలను మరింత నిజం చేసే విధంగా నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని , పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి కుటుంబ సమేతంగా తెల్లం వెంకటరావు కలవడంతో భద్రాచలంలో హాట్ టాపిక్ గా మారింది. ఈనెల 11న, బిఆర్ఎస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే భద్రాచలం లో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కనున్నాయి. ఇప్పటికే తెల్లం వెంకటరావు రాకను కాంగ్రెస్ పార్టీలో పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement