Monday, April 29, 2024

National : జ‌మ్ములో ఇంటిపై కూలిన కొండ‌చ‌రియ‌లు – న‌లుగురు దుర్మ‌ర‌ణం ..

జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం రియాసీ జిల్లాలోని మహోర్‌ సబ్‌ డివిజన్‌లోగల చస్సాన గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం గాఢ నిద్రలో ఉండగా వారు నిద్రిస్తున్న ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఇల్లు కుప్పకూలింది. ఆ ఇంట్లోని నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మృతుల్లో నాలుగు నెలల చిన్నారితోపాటు ఆమె తల్లి, మరో ఇద్దరు కుటుంబసభ్యులు ఉన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టానికి పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement