Sunday, April 28, 2024

Appeal – పంట‌ల‌కు బోన‌స్, 25వేల న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాలి – సీఎస్ శాంతి కుమారికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విన‌తి

అన్ని పంట‌ల‌ను రూ. 500 బోన‌స్‌తో కొనుగోలు చేయాల‌ని సీఎస్‌కు బీఆర్ఎస్ నాయకులు విజ్ఞ‌ప్తి చేశారు. పంట న‌ష్ట‌పోయిన రైతుల‌కు రూ. 25 వేలు ప‌రిహారం అందించాల‌ని డిమాండ్ చేశారు.ఈ మేరకు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప‌లువురు నాయ‌కులు విన‌తిప‌త్రం అందించారు. సీఎస్‌ను క‌లిసిన వారిలో జ‌గ‌దీశ్ రెడ్డి, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్, వివేకానంద గౌడ్, బాల్క సుమ‌న్, స‌త్త‌య‌వ‌తి రాథోడ్‌, శేరి సుభాష్ రెడ్డి, దండే విఠ‌ల్‌తో పాటు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement