Thursday, May 9, 2024

Breaking : స్కార్పియోలో చెల‌రేగిన మంట‌లు.. త‌ప్పిన ప్రాణ న‌ష్టం

ప్ర‌మాద‌వ‌శాత్తు స్కార్పియో వాహనం దగ్ధమైంది. ఈ వాహనం నుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించి వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు వెంటనే వాహనాన్ని నిలిపివేసి.. కిందకి దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా వాహనంలో మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. వాహన దగ్ధం విషయాన్ని వాహన యజమానులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి మంట‌ల‌ను ఆర్పివేశారు.ఈ సంఘ‌ట‌న ఎడపల్లి మండలంలోని నెహ్రూ నగర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement