Wednesday, May 1, 2024

MLA Rathod Bapurao: బోథ్‌ ఎమ్మెల్యేపై చీటింగ్‌ కేసు

ఆదిలాబాద్‌: బోథ్‌ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది. ఒకే భూమిని ఇద్దరు వ్యక్తులకు విక్రయించినందుకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుపై ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశాలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

2012లో విక్రయించిన 2 ఇళ్ల స్థలాలను రెండోసారి అమ్మారని.. ఆదిలాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లారు. తనను బాపూరావు మోసం చేశారని తెలిపారు. దీంతో కోర్టు ఆదేశాలతో.. బాపూరావు, సుదర్శన్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement