Wednesday, May 1, 2024

Kankipadu – ప‌ది కిలోల బంగారంతో ముత్తూట్ ఫైనాన్స్ ఉద్యోగి జంప్ …

కంకిపాడు: ప్రముఖ బంగారు రుణాల సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ లో ఓ ఉద్యోగిణి చేతివాటం ప్రదర్శించింది. కృష్ణా జిల్లా కంకిపాడు శాఖలోని కస్టమర్లు దాచిన బంగారంతో ఉడాయిచింది మేనేజర్ పావని. దీంతో సంస్థ యాజమాన్యంతో పాటు కస్టమర్లు ఆందోళనకు గురవుతున్నారు.


వివ‌రాల‌లోకి వెళితే కంకిపాడులోని ముత్తూట్ ఫైనాన్స్ లో పావని మేనేజర్ గా పనిచేస్తోంది. ఆమె విధులకు హాజరుకాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు బంగారాన్ని పరిశీలించారు. అయితే కస్టమర్లు దాచిన 10కిలోల బంగారం కనిపించకపోవడంతో అధికారులు కంగుతిన్నారు. ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ అధిరారుల ఫిర్యాదు మేరకు మేనేజర్ పావని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రత్యేక పోలీస్ బృందాలు సిసి కెమెరాల ఆధారంగా ఆమె ఎక్కడికి వెళ్లిందో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఆచూకీ కోస ఆమె బంధువులు, సన్నిహితులను ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement