Wednesday, May 15, 2024

నవభారత్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

తుర్కయంజాల్ (ప్రభ న్యూస్ ). తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడ 22వ వార్డు నవ భారత్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ పోచమ్మ దేవత ఆలయంలో మంగళవారం పోచమ్మ అమ్మవారికి కాలనీవాసులు బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్థానిక కౌన్సిలర్ కోషిక ఐలయ్య పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసుల సమక్షంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు శ్రీనివాస్ రెడ్డి, కొండల్ రెడ్డి, పర్వత రెడ్డి, మల్లారెడ్డి,అత్తి రెడ్డి, రాజవర్ధన్, మనోహర్, చంద్రశేఖర్ రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement