Wednesday, May 1, 2024

Bogatha Waterfalls : బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి

వాజేడు, జులై 8 (ప్రభ న్యూస్) : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. జలపాతం అందాలను తిలకిస్తూ సెల్ ఫోన్ లో బొగత జలపాతం ఫోటోలను చిత్రీకరించి ఆనందాన్ని పొందుతున్నారు. సెకండ్ శనివారం కావడంతో పర్యాటకులు అత్యధికంగా తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా.. ఆంధ్ర రాష్ట్రం, ఛతీస్ గడ్ రాష్ట్రాల నుండి కూడా పర్యాటకులు అందాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు.

కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో తరలివచ్చిన పర్యాటకులు బొగత జలపాత ప్రాంగణంలో రోజంతా గడిపి విందులు, వినోదాలతో ఆనందం పొందుతున్నారు. బొగత జలపాతాన్ని సందర్శించిన పర్యాటకులు బహుత లోయలో జలకాలాడుతూ తల స్నానాలు చేస్తున్నారు. బొగత జలపాతానికి పర్యాటకుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది. కానీ ఇక్కడ అధికారులు మాత్రం పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి బొగత పర్యాటక కేంద్రం వద్ద సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సందర్శకులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement