Monday, April 29, 2024

NZB: బీజేపీ ది సంతాప సభ.. కాంగ్రెస్ ది కోరస్ పాట.. ఎమ్మెల్సీ కవిత

నిన్న జరిగిన బీజేపీ ది సంతాప సభ అని… అలాగే కాంగ్రెస్ ది కోరస్ పాట ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత అన్నారు. ఎమ్మెల్సీ కవిత కామారెడ్డి పర్యటనలో ఉన్నారు. ముందుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. అక్కడ ఆమెకు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పెట్టి దళితులకు ఏమో చేస్తామనడం భావ దారిద్ర్యం తప్ప మరొకటి కాదన్నారు. ఖర్గే వచ్చి ఎస్సీ డిక్లరేషన్ చేయడం కోరస్ పాట పాడినట్టు ఉందన్నారు. రాజకీయం కోసం తప్ప దళితుల కోసం చేసేదేమీ లేదు. ఇన్ని రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏమి చేసింది.. ఇప్పుడు ఎన్నికలు వస్తే ఏమి చేస్తారు అని ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు.

రైతుల కోసం బీజేపీ మీటింగ్ పెట్టడం, ఆ సభకు అమిత్ షా రావడం హంతకుడే రైతులకు సంతాపం తెలిపినట్టుందని విమర్శించారు. దళితుల కోసం పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని కుంటి సాకుగా చెప్తూ ఉచిత పథకాలను ఎత్తి వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన రైతు బంధును కాపీ కొట్టి మోడీ ప్రభుత్వం 13 కోట్ల మందికి రైతు బంధు ప్రారంభించి 2.5 కోట్ల మందికే ఇస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో మాత్రం అందరికీ ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ కవిత సమక్షంలో 100 మందికి పైగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement