Saturday, May 4, 2024

TS: బీజేపీ ఎంపీలు దిష్టిబొమ్మలు… బోయినపల్లి వినోద్ కుమార్

నదుల అనుసంధానం చేస్తే..
కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాలు ఎడారే..
-తెలంగాణ లో కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదు

ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ : బీజేపీ కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం పేరుతో కొత్త నాటకానికి తెరలేపిందని…తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సమ్మక్క బ్యారేజ్, అదనపు టీఎంసీ, సీతారామ ప్రాజెక్టు, వార్దా బ్యారేజ్ లకు అనుమతులు ఇచ్చాకనే.. ఇచ్చంపల్లి ముచ్చట మాట్లాడాలని ఈ విషయంలో బీజేపీ ఎంపీలు దిష్టిబొమ్మలు లాగా ఉండొద్దని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గోదావరి..కృష్ణ రెండు నదులు నిరంతరం ప్రవహిస్తాయి. నదుల అనుసంధానం ద్వారా పూర్వపు కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మళ్లీ నీటి గోస తప్పదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతానికి గోదావరి నది ఒక కల్పతరువని.. కేంద్రం ఎంఓయూ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపడం ఏంటన్నారు. గోదావరిలో తెలంగాణ వాటా తేల్చాలి… కోటి ఎకరాలకు సాగు సాగునీళ్లు, త్రాగునీళ్లు ఇక్కడి నుంచే పోతాయని…గోదావరి నది ప్రజలకు ఆధారమన్నారు.

ఇచ్చంపల్లి దగ్గర పెద్ద డ్యాం కట్టి నీళ్లను ఇతర రాష్ట్రాలకు తరలిస్తే ఇక్కడ చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఈ నదుల అనుసంధానం ద్వారా పెద్ద అట‌వీ ప్రాంతం కనుమరుగు కావడంతో పాటు, వ్యవసాయ భూములను కోల్పోవడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అడుగుతుందని ప్రశ్నించారు. తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచి దీనిపై ఏం స్పందించడం లేదన్నారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు సర్వే 1985లో అప్పటి సీఎం ఎన్టీ రామారావు హయాంలో చేశారని పేర్కొన్నారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు కార్యాలయం వరంగల్ లో ఉండేదని, అప్పుడు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు వ్యతిరేకించాయన్నారు. గంగా నది నుంచి మహానదికి ఇంత వరకు సర్వే లేదని, గోదావరి నుంచి కృష్ణ..కావేరి నదులకు అక్కడి నుంచి తమిళనాడుకు ఎలా తరలిస్తారని దుయ్యబట్టారు.

నీటి పంపకాల విషయం తేల్చకుండా ఎలా అనుసంధానం చేస్తారని, గోదావరి బేసిన్ లోతెలంగాణ వాటా 968 టీఎంసీలు రావాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ రైతాంగం ఏళ్ళ కాలంగా సాగునీళ్లు కోసం అనేక ఇబ్బందులు పడ్డారని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాకనే రైతుల బాధలు తొలిగిపోయాయని పేర్కొన్నారు. ఈ నీళ్లు వస్తేనే రైతులకు సాగునీళ్లు వస్తాయని, కరీంనగర్, వరంగల్ జిల్లాల రైతులకు గోదావరి నీళ్లు మాత్రమే దిక్కన్నారు. నదుల అనుసంధానంపై బండి సంజయ్ సమాధానం చెప్పాలని, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వలేదన్నారు. కర్ణాటక, బుందేల్ ఖండ్ లలో ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారని, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఇప్పటి వరకు గోదావరి నీళ్లు వాడుకోవడం జరుగుతుందన్నారు. గోదావరి జలాలను తరలిస్తే బ్రతుకులు ఏమవుతాయని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టు లు కట్టారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నదుల అనుసంధానం నిలిపివేయాలని, గోదావరి నదిలో నీటి వాటాలు తేల్చాలన్నారు.

- Advertisement -

రాష్ట్రాలకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ లేఖలు రాసి ఆగం చేస్తోంది, 8-04-2024న కేంద్రం ఇతర రాష్ట్రాలకు లేఖలు రాసిందన్నారు. 47 టీఎంసీలతో సమ్మక్క బ్యారేజ్ కి క్లియరెన్స్, సీతారామ ప్రాజెక్టు, వార్దా ప్రాజెక్టుల అనుమతులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నోటికి ఏదీ వస్తే అది అర్ధరహితంగా మాట్లాడుతన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ వద్ద కాఫర్ డ్యాం కట్టక పోవడంతో 50 టీఎంసీల నీళ్లు వృధాగా పోయాయి. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన అంశంపై కేంద్ర ప్రభుత్వం అధికారులు చూసి వెళ్లి ఐదు నెలలు అయినా ఇప్పటి వరకు నివేదిక ఇవ్వలేదన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి మేడిగడ్డ వద్ద కాఫర్ డ్యాం కోసం టెండర్లు పిలుస్తున్నామ‌న్నారు. ఇన్ని రోజులు ఏమైందన్నారు. ఎంపీ బండి సంజయ్ స్పందించాలి…నదుల అనుసంధానం చేయడం కాదు. దేవుళ్ళ పేరు మీద బ్యారేజీలు, ప్రాజెక్టు లు కట్టినోల్లం మాకు చెప్పుతారా దేవుడి గురించి…ఎంపీ బండి సంజయ్… ధర్మం అని చెప్పడం ఏంటి…ధర్మం అంటే తన పని తాను చేయాలి…తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టుల అనుమతుల కోసం ప్రాజెక్టుల అనుమతుల కోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవిందర్ రావు, మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి.రామకృష్ణ రావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ అధ్యక్షుడు పొన్నం అనీల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement