Thursday, May 2, 2024

నాలుగో రోజుకి చేరిన మహేశ్వర్ రెడ్డి నిర‌శ‌న దీక్ష … క్షీణిస్తున్న ఆరోగ్యం ..

నిర్మల్ టౌన్ ఆగస్టు 19 ప్రభ న్యూస్) నిర్మల్ నిర్మల్ పట్టణం గుండా మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారం నాల్గవ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం గంట గంటకు విషమిస్తుండ‌టంతో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.. గంట గంటకు మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందని వైద్యులు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి పట్ల బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

కాగా, ఈరోజు బిజెపి అగ్ర నాయకులు వివేక్ వెంకటస్వామి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు వచ్చి దీక్షకు సంఘీభావం మద్దతు తెలుపనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement