Sunday, April 28, 2024

BJP – అన్ని వ‌ర్గాల‌ను మోసం చేసిన సిఎం కెసిఆర్ – బిజెపి ఎంపి ల‌క్ష్మ‌ణ్

హైద‌రాబాద్ – తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ నమ్మించి మోసం చేశారన్నారు బిజెపి ఎంపి ల‌క్ష్మ‌ణ్. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఉద్యమకారులను, రైతులను, విద్యార్థులను నమ్మించి మోసం చేయడం సీఎం కేసీఆర్‌కే సాధ్యమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో మద్యపాన నిషేధం ఉండగా. తెలంగాణలో మద్యం ఏరులై పారుతుందని తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ప్రజలను నమ్మించి మోసం చేస్తూ కేసీఆర్, కేటీఆర్‌లు పబ్బం గడుపుకుంటున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement