Saturday, May 18, 2024

BJP Elcecton Campaign ప్రచార ఆర్భాటమే.. అభివృద్ధి లేదు .. బీ ఆర్ ఎస్‌ పై ఫడ్నవీస్ విమర్శలు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగ‌ళ‌వారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ నియోజకవర్గం దోమలగూడలొ బీజేపీ అభ్యర్ధి పూస రాజు తరపున పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా సీఎం కేసీఆర్‌ నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రచారం ఆర్భాటం తప్ప కేసీఆర్‌ వల్ల తెలంగాణలో ఎలాంటి అభివృద్ది జరగలేద‌ని విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు.

తెలంగాణలో మాఫియా రాజ్యం: కిషన్ రెడ్డి
తెలంగాణలో మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్‌రెడ్డి. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఎలాంటి లాభం ఉండదని, తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement