Friday, May 3, 2024

రెండు బైకులు ఢీకొని.. బిహార్ వలస కూలి మృతి

ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో వలసకూలీ మృతి చెందడంతో పాటు మరో ఇద్దరు గాయపడ్డ సంఘటన పెద్దపల్లి పట్టణ శివారులో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి నిట్టూరు లోని మారుతి రైస్ మిల్ లో పనిచేస్తున్న బిహారీ కూలీలు సునీల్, గణపతి లు ద్విచక్ర వాహనంపై నిట్టురు కు వెళుతుండగా ఎలిగేడు మండలం లాల పల్లికి చెందిన పెద్దపల్లి మున్సిపల్ వర్కర్ వడ్లురి రవీందర్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టారు.

ఈ ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన వలసకూలీ సునీల్ అక్కడికక్కడే మృతి చెందగా ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న గణపతితో పాటు మున్సిపల్ సిబ్బంది అయినా రవీందర్ సైతం గాయపడ్డారు. క్షతగాత్రులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement