Tuesday, April 23, 2024

రామానుజ ఉత్సవాలకు రానున్న రాష్ట్రపతి.. టూర్​ షెడ్యూలు ఖరారు

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఈనెల 13, 14 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి తాత్కాలిక షెడ్యూల్‌ పంపించింది. రాష్ట్రపతి 13న ముంబై నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో వస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ముచ్చింతల్‌లో జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలలో పాల్గొంటారు. ఆ తరువాత రాజ్‌భవన్‌కు చేరుకొని రాత్రి అక్కడే బసచేస్తారు. 14న ఉదయం 10.20 గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి వెళ్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement