Saturday, May 4, 2024

Big Breaking : ఫీజు విష‌యంలో వివాదం-పెట్రోల్ పోసుకున్న విద్యార్థి- ప్రిన్సిపాల్ తో స‌హా ప‌లువురికి గాయాలు

ఫీజు విష‌యంలో ప్రిన్సిప‌ల్ ..స్టూడెంట్ సాయినాథ్ మ‌ధ్య వివాదం జ‌రిగింది. కాగా సాయినాథ్ వెంట తండ్రి ..విద్యార్థి నేత సందీప్ ఉన్నారు. రూ.16వేలు ఫీజు డ్యూ ఉన్నాడు సాయినాథ్..దాంతో ప్రిన్సిపాల్ తో వాగ్వాదం జ‌రిగింది. విద్యార్థి నేత సందీప్ పెట్రోల్ పోసుకున్నాడు. సందీప్ వెన‌కాల దీపం ఉండ‌టంతో క్ష‌ణాల్లో మంట‌లు అంటుకున్నాయి. విద్యార్థి నాయ‌కుడు సందీప్ పెట్రోల్ బాటిల్ తో వ‌చ్చాడ‌ని ఈస్ట్ జోన్ డీసీపీ తెలిపారు ఈ మేర‌కు ప్రిన్సిపాల్ రూమ్ లో నిప్పంటిచుకున్నాడు విద్యార్థినేత సందీప్. మంట‌ల‌తో ప్రిన్సిపాల్ ని ప‌ట్టుకోవ‌డంతో ఇద్ద‌రికీ గాయాలు అయ్యాయి.అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన ఏవోకి గాయాలు అయ్యాయి. ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు విద్యార్థి. ప్రిన్సిపాల్ పై పోసేందుకే పెట్రోల్ తీసుకువ‌చ్చాడ‌ని డీసీపీ వెల్ల‌డించారు. ఈ సంఘ‌ట‌న రామంతాపూర్ నారాయ‌ణ కాలేజీలో చోటు చేసుకుంది. వారిని అడ్డుకోబోయిన సిబ్బందికి మంట‌లు అంటుకున్నాయి. గాయాల‌పాల‌య్యారు విద్యార్థి..కాలేజి సిబ్బంది. గాయాల‌పాలైన వారిని గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు కాలేజ్ సిబ్బంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement