Sunday, April 28, 2024

మాక్లూర్‌లో స్మృతి వనానికి భూమి పూజ

మండల కేంద్రం మాక్లూర్‌లో అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ గుప్తాకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేస్తున్న స్మృతి వనానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి భూమి పూజచేశారు. గణేష్‌ గుప్త తండ్రి కృష్ణ మూర్తి ప్రథమ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోచారంతో పాటు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు చెందిన స్వంత వ్యవసాయ క్షేత్రంలో తన తండ్రి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేయ తలపెట్టిన స్మృతి వనానికి పోచారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అంతకు ముందు కృష్ణ మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, జీవన్‌ రెడ్డి, సురేందర్‌, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement