Friday, May 3, 2024

భట్టి అడుగుల్లో అడుగేసిన నేతలు

యాదాద్రి – 46వ రోజు పీపుల్స్ మార్చ్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడుగుల్లో అడుగేసి జిల్లా కాంగ్రెస్ నేతలు ముందుకు సాగారు. ఆలేరు, కొలనుపాక, రాజనగరం, రాజాపేట మండలం దూదివేంకటాపురం, రఘునాథపురం గ్రామాల్లో యాత్ర కొనసాగింది. కొలనుపాక, రఘునాథపురం గ్రామాల్లో కార్నర్ సమావేశాల్లో మాట్లాడారు. దారి పొడవునా కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు నీరాజనాలు పలుకగా రైతులు, ఆయా కులవృత్తుల సంఘాల సభ్యులు తమ సమస్యలను విన్నవించగా ఇందిరమ్మ రాజ్యంతోనే సమస్యలు పరిష్కరమవుతాయన్నారు. ఈ యాత్రలో మాజీ ఎంపీ రాజయ్య, నాయకులు కుడుదుల నగేష్, బీర్ల ఐలయ్య, కల్లూరి రామచంద్రారెడ్డి, జనాగం ఉపేందర్ రెడ్డి, నీలం పద్మ, బోళ్ల కొండల్ రెడ్డి, బుడిగే పెంటయ్య గౌడ్, శ్రీశైలం, బాలరాజు, మహేందర్ గౌడ్, ఇంజ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement