Sunday, May 19, 2024

కేయూలో సీఎల్పీ నేత భ‌ట్టి పీపుల్స్ మార్చ్ – విద్యార్ధుల‌తో ముఖాముఖి

వ‌రంగ‌ల్ – పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర చేస్తూ ప్ర‌జ‌ల క‌ష్టాలు తెసుకుంటున్న సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌ను.. త‌మ క‌ష్టాలు, బాధ‌లు తెసుకుల‌నేందుకు ఒక్కసారి కాకతీయ యూనివ‌ర్సిటీకి రావాల‌ని ఆహ్వానించారు. విద్యార్థుల ఆహ్వానం మేర‌కు వారి ఇబ్బందులు ప్ర‌త్య‌క్షంగా వారితో మాట్లాడి తెలుసుకునేందుకు యూనివ‌ర్సిటీకి భ‌ట్టి విక్ర‌మార్క వెళ్లారు. యూనివ‌ర్సిటీల ప్రైవేటీక‌ర‌ణ‌, గ్రూప్ పేప‌ర్ల లీకేజీ, రిజ‌ర్వేష‌న్ల ఇబ్బందుల‌ను స‌మ‌స్య‌ల‌నుయ సీఎల్పీ నేత దృష్టికి విద్యార్థులు తీసుకువ‌చ్చారు.
సూర్య‌పేట‌కు చెందిన రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల్సిందేన‌ని.. వారి కోటా వారికి ఇవ్వాల్సిందేనేని . అదే విధానాన్ని చ‌ట్ట‌స‌భ‌ల్లో కూడా కేసీఆర్ అమ‌లు చేయాల‌ని కోరారు.

మ‌రో విద్యార్థి డోంగ్రూ క‌చ్రూ మాట్లాడుతూ.. విద్యార్థుల ల‌క్ష్యాన్ని కేసీఆర్ ప్ర‌భుత్వం ల‌క్ష‌ల‌కు అమ్ముకుంటోంద‌ని ఆవేద‌న‌గా చెప్పారు. రూ.5 భోజ‌నం తింటూ.. చ‌దువుకుని ఉద్యోగాల‌కు ప్రిపేర‌వుతున్నామ‌ని . కానీ ఉద్యోగాల‌ను అమ్ముకుని బ‌తుకున్నారు. రోస్ట‌ర్ పాయింట్లు చూస్తేంటే మాకు ద‌డ పుడ్తోంది.. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల్సిందే.. కానీ పురుషుల కోటా మాత్రం క‌చ్చితంగా అమ‌లు చేయాలి. తెలంగాణ‌కుకావాల్సింది.. కుటుంబ రాజ్యం.. మ‌త రాజ్యం కాదు.. ప్ర‌జాస్వామ్య రాజ్యాం కావాల‌ని చెప్పారు.


విద్యార్థి రాకేష్ మాట్లాడుతూ.. లైబ్రరీలో పుస్తకాలు లేవు, భోజనం బాగుండం లేదు.. రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు.. అవుట్ సోర్సింగ్ ప్యాకల్టీతో తరగతులు చెప్పిస్తున్నారు. గురుకుల పోస్టుల భర్తీలో పురుష అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.
అనంత‌రం సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. ఉమ్మ‌డి రాష్ట్రంలో కాక‌తీయ యూనివ‌ర్సిటీ ఒక పెద్ద వ‌ర్సిటీగా, ఎన్నో ఉద్య‌మాల‌కు, భావ‌జాలాల‌కు, సామాజిక మార్పుల‌కు వేదిక‌గా నిలిచింద‌న్నారు. ఇలాంటి ప‌విత్ర ప్రాంతంలో నిల‌బ‌డి మాట్లాడ్డం ఒక అదృష్టంగా నేను భావిస్తున్న అన్నారు . తెలంగాణ‌లో ఇలాంటి రోజు వ‌స్తుంద‌ని నేను ఊహించ‌లేద‌ని. ఇలాంటి రోజెప్పు రావ‌ద్ద‌నే సోనియ‌మ్మ తెలంగాణ ఇచ్చింద‌న్నారు. రాష్ట్ర సంప‌ద నాలుగుకోట్ల మందికి పంచ‌బ‌డి, ప్ర‌తి ఒక్క‌రూ ఆత్మ గౌర‌వంతో జీవించాల‌ని సోనియ‌మ్మ ఆలోచ‌న చేసింద‌న్నారు. స‌క‌ల స‌మస్య‌ల‌కు ప‌రిష్కారం తెలంగాణ ఏర్పాటు మాత్ర‌మే అనుకున్నామ‌ని, కానీ ఉమ్మ‌డి రాష్ట్రంతో పోలిస్తే ఇప్పుడే స‌మ‌స్య‌లు, ఇబ్బందులు ఎక్కువ‌గా ఉన్నాయన్నారు.
ప్ర‌భుత్వంలో ఖాళీగా ఉన్న 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు, ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌ల్లోని ఖాళీల‌ను ప్ర‌భుత్వం నింప‌డం లేదు.కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ‌లో ఆ ల‌క్ష్యాన్ని బీఆర్ఎస్ ప్ర‌భుత్వం దెబ్బ‌తీసింఇది. నీళ్లు, నిధ‌లు, నియాక‌మాలు, ఆత్మ‌గౌర‌వం, తెలంగాణ ల‌క్ష్యాలు నెర‌వేరేవ‌ర‌కూ విద్యార్థ‌థి లోకం పోరాటినికి సిద్ధం కావాలి.

స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే మేధ‌స్సు క‌లిగిన మాన‌వ‌వ‌న‌రులు విద్యార్థ‌లని గుర్తించాల‌న‌నారు. విద్యార్థుల భావ‌జాలాలు, ఆలోచ‌న‌లు, స‌మాజ మార్పుకు దోహ‌ద‌ప‌డే ఎన్నో చ‌ట్టాలు వ‌చ్చేందుకు దోహ‌ద‌ప‌డ్డాయ‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 11 వ‌ర్సిటీలు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన‌వే నంటూ ఈ తొమ్మిదిన్న‌ర ఏళ్ల‌లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఒక్క‌టి వ‌ర్సిటీని ఎందుకు ఏర్పాటు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు… ఉన్న ప్ర‌భుత్వ వ‌ర్సిటీల‌ను నిర్వీర్యం చేసే కుట్ర‌ను బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోందని ఆరోపించారు.
కేసీఆర్ ఇంకా కొనసాగితే వ‌ర్సిటీ భూముల‌ను కూడా అమ్మేస్తార‌ని వ్యాఖ్యానించారు. మేడిగ‌డ్డ‌, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి అద‌నంగా ఒక్క ఎక‌రాకు సాగునీరు పార‌లేద‌న్నారు. వ‌రంగ‌ల్ జిల్లాలో సాగుకు అందుతున్న నీళ్ల‌న్ని కాక‌తీయ కాలువ‌, దేవాదుల ఎత్తిపోత ప‌థ‌కం ఫేజ్ 1 నుంచేన‌ని అన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఆత్మ‌గౌర‌వం లేకుండా 70 ఏళ్ల‌నాటి ఫ్యూడ‌ల్ వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ధ‌రించేలా బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేస్తోంద‌న్నారు.. టీ.ఎస్.పీ.ఎ.ఎస్సీ ర‌ద్దుకు రాష్ట్ర‌ప‌తికి లేఖ రాస్తాన‌ని చెప్పారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement