Tuesday, May 7, 2024

TS | భార‌త జాగృతి జిల్లా క‌మిటీలు.. ప్ర‌క‌టించిన ఎమ్మెల్సీ క‌విత‌

తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో భారత జాగృతి సంస్థ బలోపేతానికి, ఆశయాల సాధనకు శక్తి వంచన లేకుండా కృషిచేయాలని సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. సంస్థాగత నిర్వహణ కోసం జిల్లాల వారీగా కమిటీ లీడ‌ర్ల‌ను ఇవ్వాల (శ‌నివారం) ప్రకటించారు. ఈ నియామకాలు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపారు. భారత జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా అనంతుల ప్రశాంత్‌ను నియ‌మించిన‌ట్లు క‌విత తెలిపారు.

ఇక‌.. జోగుళాంబ-గద్వాల జిల్లా అధ్యక్షుడిగా ఎల్వీఎన్ రెడ్డి, సిద్ధిపేట అధ్యక్షుడిగా పీ శ్రీధర్ రావు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా అప్పాల నరేందర్ యాదవ్, యాదాద్రి – భువనగిరి అధ్యక్షుడిగా చందుపట్ల సుజీత్ రావు, మెదక్ జిల్లా అధ్యక్షుడిగా వీరప్పగారి రమేశ్ గౌడ్, హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా మూల రాము గౌడ్ నియమితులయ్యారు.

హైదరాబాద్ జిల్లా కో కన్వీనర్‌గా బీ వేణుగోపాల్ రావు, భారత జాగృతి యువజన విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గా బొల్లంపల్లి సందీప్ నియమితులయ్యారని భారత జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement