Monday, April 29, 2024

వ‌ర్షంలోనూ న‌మ‌స్తే ఉప్ప‌ల్ పాద‌యాత్రను కొన‌సాగిస్తున్న ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

రామంతపూర్ : ఏ ఇంటికి వెళ్లినా సీఎం కేసీఆర్ పథకాలు చూసి తమకి మంగళ హారతులు పడుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి తెలిపారు. సమస్యల పరిష్కారమే ద్యేయంగా ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి చేపట్టిన నమస్తే ఉప్పల్- మీకోసం… మీ ఎమ్మెల్యే.. కార్యక్రమంలో భాగంగా చే రామతపూర్ డివిజన్ లో కొనసాగుతుంది. వర్షంలో కూడా ఎమ్మెల్యే గల్లీ గల్లీ తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ వాటికి పరిష్కారం చూపిస్తున్నారు.

పాదయాత్రకి అపూర్వ స్పందన లభిస్తుందని, సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి ప్రజలలోకి తీసుకువెళ్తూ, నియోజకవర్గంలో ఇంకా మిగిలి ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే భేతి.మూడవసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement