Tuesday, May 7, 2024

బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల

దండేపల్లి,సెప్టెంబర్28(ప్రభ న్యూస్):వెర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కేంద్ర మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాల మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. గురువారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పాత మామిడిపెళ్లి లో వెర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్ మహిళలకు పంపిణీ చేసిన బతుకమ్మ చీరెలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ లో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి అలవాటుపడి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని అన్నారు.రాబోవు ఎన్నికల్లో బీజేపీ కి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.

.ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్, వెర్రబెల్లి ట్రస్ట్ కన్వీనర్ వెర్రబెల్లి స్రవంతి,మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య, మండల ఇంచార్జి గుండా ప్రభాకర్, మండల ప్రధాన కార్యదర్శి బండెల రవి గౌడ్,నాయకులు సతయ్య, సురేందర్, అనిల్, వంశీ, రాకేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement