Thursday, May 2, 2024

HYD: మంత్రి త‌ల‌సానిని స‌త్క‌రించిన బ‌త్తిన హ‌రినాధ్ గౌడ్

హైదరాబాద్: ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలతోనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేప ప్రసాదం పంపిణీ చేయగలిగామని బత్తిన హరినాధ్ గౌడ్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మంగళవారం బత్తిన హరినాధ్ గౌడ్ కుటుంబ సభ్యులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 5లక్షల మందికి చేప ప్రసాదం పంపిణీ చేసినట్లు మంత్రికి వివరించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఏర్పాట్లపై అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి పర్యవేక్షించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్, తమకు అన్ని విధాలుగా సహకరించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన వారిలో బత్తిన అమర్నాధ్ గౌడ్, సంతోష్, శివ శంకర్, రోషన్ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement