Wednesday, May 1, 2024

TS: భారీ బైక్ ర్యాలీతో నామినేషన్ కు బయల్దేరిన బండి సంజయ్

భారతీయ జనతా పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నామినేషన్ వేసేందుకు బయల్దేరారు. కరీంనగర్ లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద బైక్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ తో పాటు బీజేపీ శాసనసభ పక్ష నాయకులు రాజాసింగ్ ఆ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీకి వేలాది మంది యువతీ యువకులు స్వచ్చందంగా తరలివచ్చారు. భారీ బైక్ ర్యాలీ అనంతరం బండి సంజయ్ నామినేషన్ వేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement