Saturday, April 27, 2024

ఇవాళ అమిత్ షాతో భేటీ కానున్న బండి సంజయ్, ఈటల

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్తున్నారు. వీరు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. కాసేపట్లో హైదరాబాద్ నుంచి వారు ఢిల్లీకి పయనమవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వీరి సమావేశం జరగనుంది. ఈ భేటీ సందర్భంగా తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ స్థితిగతులపై చర్చించనున్నారు. దీంతో పాటు హుజూరాబాద్ ఉపఎన్నికకు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్న తీరును అమిత్ షాకు వీరు వివరించనున్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటన గురించి బండి సంజయ్ మాట్లాడుతూ, అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్తున్నామని చెప్పారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ ఉపఎన్నికపై గులాబీ వ్యూహారచన

Advertisement

తాజా వార్తలు

Advertisement