Saturday, May 11, 2024

బండి క‌స్ట‌డీ పిటిష‌న్ డిస్మిస్… మ‌రో ముగ్గురికి బెయిల్

వరంగల్ లో పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజీ కేసులోఅరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల‌కు హ‌నుమ‌కొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్ ను డిస్మిస్ చేసింది. ఈ కేసులో దాఖ‌లైన సంజ‌య్ క‌స్ట‌డీ పిటిష‌న్ ను, ముగ్గురి బెయిల్ పిటిష‌న్ ను నేడు కోర్టు విచారించింది.. క‌స్ట‌డీ పిటిష‌న్ పై ఇప్పటికే పోలీసుల విచారణ పూర్తయ్యిందంటూ బండి సంజయ్ తరపు లాయర్ల వాదనలతో ఏకీభవించింది కోర్టు. కేసులో కుట్ర కోణం లేదని.. కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదని బండి సంజయ్ తరపు లాయర్లు వాదనలు వినిపించారు. దీంతో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటీషన్ కొట్టివేసింది కోర్టు.


అలాగే బండి సంజయ్ తోపాటు జైలుకు వెళ్లిన మరో ముగ్గురి బెయిల్ పిటిష‌న్ ల‌పై వాద‌న‌లు విన్న కోర్టు వారికి కూడా ష‌రుతుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈ కేసులో టెన్త్ పేపర్ లీక్ కేసులో మొత్తం ఐదుగురు నిందితులుగా ఉన్నారు. బండి సంజయ్ తోపాటు అరెస్ట్ అయిన మరో ముగ్గురిని కలుపుకుంటే.. మొత్తం నలుగురికి బెయిల్ మంజూరైంది. ఒకరు మైనర్ గా ఉన్నారు. ఆ బాలుడిని ఇంకా అరెస్ట్ చేయలేదు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement