హైదరాబాద్, ఆంధ్రప్రభ : త్యాగానికి ప్రతీకగా ఇస్లాం మతస్థులు జరుపుకునే పవిత్ర పండుగ బక్రీద్(ఈద్ ఉల్ అజ్ హా) సందర్భంగా సీఎం కేసీఆర్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తిని, త్యాగ గుణాన్ని బక్రీద్ పండుగ చాటిచెబుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా, దేవినిపై విశ్వాసాన్ని కల్గి, సన్మార్గంలో జీవనాన్ని సాగించాలనే గొప్ప సందేశాన్ని బక్రీద్ పండుగ మానవాళికి ఇస్తుందని ఆయన అన్నారు. తమకు కలిగినదాంట్లోనుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటిలేదనే స్పూర్తిని బక్రీద్ పండుగ కలిగిస్తుందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.