Saturday, April 27, 2024

NZB: ఆటో బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

బీర్కూర్, ఫిబ్రవరి 3 (ప్రభ న్యూస్): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం సమీపంలో ఆటో బోల్తా పడి ఒకరు మృతిచెంద‌గా.. ముగ్గురికి గాయాలైన ఘటన చోటు చేసుకుంది. ఆటో బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుందని బాధితులు తెలిపారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న బీర్కూర్ పోలీస్ సిబ్బంది మృతుడు సబ్బిడి నర్సింలు(53)గా తెలిపారు.

అనంతరం గాయపడిన వారిని బాన్సువాడ‌ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు నర్సింలుకు ఒక్క కుమార్తె. కాగా కూతురు బర్త్ డే సందర్భంగా తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం ను దర్శించుకొని తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరగటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement