Sunday, April 28, 2024

బీజేపీ నేత కుటుంబంపై దాడి.. 8మంది బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు

ఫిలిం నగర్ పద్మాలయ అంబేడ్కర్ నగర్ అట్టుడుకింది. బీజేపీ నేత కుటుంబంపై దాడి చేయడంతో 8మంది బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది. బీఆర్ఎస్ నేతలపై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిందితుల్లో ఎమ్మెల్యే దానం ప్రధాన అనుచరుడు ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేత కుటుంబ సభ్యులపై మూకుమ్మడి దాడి చేశారు.

కార్లలో వచ్చిన పది మందికి పైగా రాడ్లు, రాళ్లతో మూకుమ్మడి దాడికి పాల్పడడంతో పాటు వాహన అద్దాలు ధ్వంసం చేసి, ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఒకరికి తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. దీంతో 8మంది బీఆర్ఎస్ నేతలపై ఐపీసీ సెక్షన్ 307, 143, 148, 452, 324, 427, r/w 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నేతలు కృష్ణ, నర్సింహా, సాయి, ఈశ్వర్, సైఫ్ లను ఫిలిం నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement