Saturday, May 4, 2024

తేనెటీగల దాడి.. 20మందికి తీవ్రగాయాలు

తేనెటీగల దాడిలో 20మందికి తీవ్రగాయాలైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని అసిఫాబాద్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని కోటగూడలో 56 మంది ఉపాధి కూలీలు ఉపాధి పనులకు వెళ్తుండగా.. వారిపై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడిలో 20మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement