Monday, April 29, 2024

రాష్ట్రపతి నిలయంలో ఎట్‌ హోం.. హాజరైన గవర్నర్‌ తమిళిసై, సీఎం , మంత్రులు, వివిధ పార్టీల నేతలు

హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం ఎట్హోం కార్యక్రమం నిర్వహించారు.శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో పాటు.. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే దంపతులు హాజరయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డితో కలిసి గవర్నర్ తమిళిసై రాష్ట్రపతికి సాదరస్వాగతం పలకగా.. అనంతరం రాష్ట్రపతి అందించిన ఆతిథ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాదరావు, శాసనమండలి చైర్మన్ రాష్ట్రపతితో భేటీ అయ్యారు. బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీష్‌ రావు, కడియం శ్రీహరి తదితర ఎమ్మెల్యేలు హాజరయ్యారుతెలంగాణ ప్రభుత్వానికి చెందిన నాయకులు, అధికారులతో రాష్ట్రపతి ప్రత్యేకంగా ఫొటోలు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement