Friday, April 26, 2024

10 లక్షల మందికి సెకండ్ డోస్.. నెటిజన్ల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలు

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 10 లక్షల 30 వేల మందికి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో ముందుందని ఆయన అన్నారు. జాతీయ సగటు కంటే తెలంగాణలోనే ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చిన తెలిపారు. అయితే వ్యాక్సినేషన్ ఉత్పత్తే ఇప్పుడు సవాల్‌గా మారిందని చెప్పారు.

దేశవ్యాప్తంగా ఆక్సిజన్ దొరకడం లేదని, ఆక్సిజన్ సరఫరా మొత్తం కేంద్రం చేతుల్లోకి తీసుకుందని కేటీఆర్ అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రెమిడెసివర్ వాడకంపై ఆడిట్ చేస్తున్నామని తెలిపారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అవసరం లేకున్నా వాడుతున్నట్టు తేలిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement