Saturday, May 4, 2024

TS | తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి.. ఎక్స్​లో ట్వీట్ చేసిన కేటీఆర్

తెలంగాణలో రూ. 934 కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు కార్నింగ్ కంపెనీ ఇవ్వాల (శుక్రవారం) వెల్ల‌డించింది. రాష్ట్రంలో గొరిల్లా గ్లాస్ త‌యారీ ప‌రిశ్ర‌మ పెట్టాల‌ని కార్నింగ్ కంపెనీ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు కంపెనీ ప్ర‌తినిధుల‌తో ఒప్పందం కుదిరింద‌ని మంత్రి కేటీఆర్ ఎక్స్​లో ట్వీట్​ చేశారు. మెటీరియల్ సైన్సెస్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ సంస్థ.. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌ల కోసం గొరిల్లా గ్లాస్‌ను తయారు చేయడానికి తెలంగాణ‌లో తయారీ ప్లాంట్‌ను నెల‌కొల్పాల‌ని నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సంస్థ ఏర్పాటుతో 800 మందికి ప్ర‌త్య‌క్ష ఉపాధి ల‌భిస్తుంద‌ని కేటీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement