Thursday, May 2, 2024

Breaking: బోరబండలో మరో కుటుంబం ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలోని బోరబండలో మరో కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల కథనం మేరకు.. జ్యోతి(31) అనే మహిళ బంజారాహిల్స్‌లోని ఓ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నది. ఆమె భర్త విజయ్‌ సెంట్రింగ్‌ కాంట్రాక్టర్‌ పని చేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ, జ్యోతి తన ఇద్దరు పిల్లలు అర్జున్‌(4),ఆదిత్య (2)లకు విషమిచ్చి తాను ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవాళ ఉదయం సికింద్రాబాద్‌ సమీపంలోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోగల భవానీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో తండ్రీ, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన బిడ్డలిద్దరికీ నిద్ర మాత్రలు ఇచ్చిన తండ్రి తాను కూడా తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement