Saturday, May 4, 2024

KHM: అమ్మ దీవెన… శ్రీరామ రక్ష… ప్రభుత్వ విప్ రేగా

మణుగూరు, నవంబర్ 9 (ప్రభ న్యూస్): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పినపాక బీఅర్ఎస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇవాళ మణుగూరులోని తహీశీల్దార్ కార్యలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ కార్యలయంలో నామినేషన్ వేసేందుకు బయల్దేరారు.

నామినేషన్ వేసే ముందు కరకగూడెం మండలంలోని కోర్నవల్లి తన స్వగృహంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు-సుధరాణి దంపతులు తన మాతృమూర్తి దీవెనలను తీసుకున్నారు. మళ్ళీ ఎమ్మెల్యే గా గెలిచి రావాలని, అ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని, తనయుడిని దీవించారు.అనంతరం పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement