Friday, May 3, 2024

Gadwal – 18న కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాక …ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన డికె అరుణ

గద్వాల (ప్రతినిధి) నవంబర్ 15 (ప్రభ న్యూస్) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 18న కేంద్ర హోం మంత్రి అమిత్ షా గద్వాలకు రానున్న నేపథ్యంలో ఐజా రోడ్డు సమీపంలో సభా స్థలాన్ని, హెలిపాడ్ స్థలాన్ని జిల్లా బిజెపి నాయకులతో కలిసి పరిశీలించారు. బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఈ కార్యక్రమంలో డీకే అరుణతో పాటు గద్వాల నియోజకవర్గ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బోయ వాల్మీకి శివారెడ్డి, జిల్లా బిజెపి అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి, బిజెపి నాయకులు రామాంజనేయులు, పూజారి శ్రీధర్, నల్లారెడ్డి, మోహన్, రవి ఎగ్బోటి, చిత్తారి కిరణ్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement