Sunday, April 28, 2024

TDP – పులివెందుల ప్రజల్ని ఎదుర్కోలేని పిరికి పంద వైఎస్ జగన్ – నారా లోకేష్

అమ‌రావ‌తి – సొంత నియోజకం పులివెందుల ప్రజల్ని ఎదుర్కోలేని పిరికి పంద వైఎస్ జగన్ అని టిడిపి జాతీయ కార్య‌దర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎన్నికల ప్రత్యర్థి, టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవిని చూసినా భయపడుతున్నాడరని అందువల్లే ఆయనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఘోర ఓటమి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అన్నారు. అందుకే టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌లు చేయిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు.

పుట్టిన ఊరు, గెలిచిన నియోజకవర్గం పులివెందుల వెళ్లాల్సి వచ్చినా సీఎం జగన్ భయంతో వణికిపోతున్నారని అన్నారు. పరదాలు, బారికేడ్లు, ముందస్తు అరెస్టులు, దుకాణాల మూసివేత, చెట్ల నరికివేత ఇన్ని చేసినా ఓట్లేసిన జనాన్ని చూడాలంటే జగన్ రెడ్డికి భయమని ఎద్దేవా చేశారు. రాజకీయ కక్ష సాధింపునకు పోలీసుల్ని పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నాడని మండిపడ్డారు. రవి కి ఏం జరిగినా జగన్, పోలీసులదే బాధ్యత అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement