Thursday, May 2, 2024

బండి సంజ‌య్ కు ఫోన్ చేసిన అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ఫోన్ చేశారు. సోమ‌వారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై జరిగిన దాడిపై బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులకు మద్దతుగా నిన్న బండి సంజయ్ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయనపై రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ప్రస్తుతం ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తలకు కారణమైంది. ఈ సంఘటనపై బీజేపీ అధి నాయకత్వం కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్రహోం మంత్రి బండి సంజయ్ కు ఫోన్ చేసి నిన్న జరిగిన దాడిపై అడిగి తెలుసుకున్నారు. ఘటనపై అమిత్ షా డీజీపీతో మాట్లాడుతా ..అన్నట్లు సమాచారం. కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయ‌క‌త్వానికి అండగా ఉంటుందని సంజయ్ కు అమిత్ షా అభయమిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement