Thursday, May 2, 2024

రాష్ట్రానికి కొత్త‌గా ఐపీఎస్‌ల కేటాయింపు.. వీరిలో ఇద్ద‌రు తెలంగాణ వారే!

తెలంగాణ రాష్ర్టానికి ఐదుగురు కొత్త ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌ను కేంద్రం కేటాయించింది. 2020 బ్యాచ్‌కు చెందిన మొత్తం 200 మంది ఐపీఎస్‌ల‌లో తెలంగాణకు ఐదుగురు, ఆంధ్రప్రదేశ్‌కు నలుగురు చొప్పున కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 నవంబర్‌ నాటికి ఉన్న ఖాళీల ఆధారంగా ఈ మేరకు కేటాయింపులు చేసింది. అయితే.. తెలంగాణ రాష్ర్టానికి కేటాయించిన‌ ఐదుగురు ఐపీఎస్‌ అధికారుల్లో అవినాశ్‌కుమార్‌(బిహార్), కాజల్ (ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌), కంకణాల రాహూల్‌రెడ్డి (తెలంగాణ‌), శివం ఉపాధ్యాయ (అసోం), సరుకొంటి శేషాద్రిణి రెడ్డి (తెలంగాణ‌) ఉన్నారు. అదేవిధంగా ఏపీ కేడర్‌కు కేటాయించిన వారిలో వర్షిత ఆడెపు (ఒడిశా), బి ఆదిత్య (రాజ‌స్థాన్‌), అభిషేక్‌ అందాసు (రాజ‌స్థాన్‌), కోటా కిరణ్‌కుమార్ (బిహార్), చిలుముల రజనీకాంత్ (మ‌హారాష్ట్ర‌) ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement