Thursday, April 18, 2024

మైనర్ బాలికపై మూడు రోజులుగా అత్యాచారం, ఆలస్యంగా వెలుగులోకి.. నిందితుడి అరెస్ట్

సరూర్ నగర్, (ప్రభ న్యూస్ ): ఎదురు ఇంట్లో ఉంటున్న బాలికను ఆటో డ్రైవర్ తన ఇంటికి పిలిచి భయపెట్టి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్​లోని ఎల్బీ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలబీ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో తండ్రి లేకపోవడంతో తల్లితోనే మైనర్ బాలిక (09) ఉంటోంది. ఫేస్ -2 లో నివాసము ఉంటున్న సలీం (30) వివాహం కాగా, అతనికి ఇద్దరు పిల్లలున్నారు. ఆటో డ్రైవర్​గా పనిచేస్తున్న సలీం తరచుగా భార్యతో గొడవ పడేవాడు. కొద్ది రోజుల క్రితం అతనితో గొడవపడిన భార్య పుట్టియింటికి వెళ్లి పోయింది. 3 నెలలుగా ఒంటరిగా ఉంటున్న సలీం ఎదురుగా ఉంటున్న బాలికపై కన్నేశాడు.

కాగా, పది సంవత్సరాలనుండి ఒక కుటుంబం ఆ ఇంట్లో నివాసం ఉంటుంది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు. భర్త ఆరు సంవత్సరాల క్రితం ప్రమాదంలో మరణించాడు. అప్పటినుండి కుటుంబాన్ని ఆమె పోషిస్తోంది. ఆమె చిన్న కూతురు (09) ఇంటివద్దే ఉంటుంది. బాలికపై కన్నేసిన సలీం మధ్యాహ్నం సమయంలో బాలికను పిలిచి దుకాణనికి వెళ్లి సిగరెట్లు తేవాలని బెదిరించాడు. ఇదే అధనుగా తీసుకుని మూడు రోజుల నుండి బాలికపై లైంగికంగా దాడి చేస్తున్నాడు. బాలికకు వాళ్ల బాబాయ్ అంటే భయం ఉండడంతో విషయం బయటకు చెబితే కొట్టిస్తానని చెప్పడంతో ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది.

రోజు బాలిక సలీం ఇంట్లోకి వెళ్లి రావడన్ని గమనించి పక్కనే ఉండే మరో మహిళా గురువారం రాత్రి బాలిక తల్లికి సమాచారం ఇచ్చింది. ఇక.. రాత్రి సమయం కావడంతో శుక్రవారం ఉదయం బాలికను అడిగి విషయం తెలుసుకుంది. 3 రోజులుగా సలీం తనపై చేసిన అత్యాచారం గురించి ఆ బాలిక ఏడుస్తూ తల్లికి చెప్పుకుంది. వెంటనే స్థానికుల సహాయంతో సలీంను పట్టుకుని దేహ శుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలి తల్లి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం వనస్థలిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement