Monday, April 29, 2024

NZB :బీజేపీ మేనిఫెస్టో చూశాక బిఆర్ఎస్ కాంగ్రెస్ లకు వణుకుపుట్టింది

నిజామాబాద్ సిటీ, నవంబర్19 (ప్రభ న్యూస్)
బీజేపీ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో చూశాక.. బిఆర్ ఎస్, కాంగ్రెస్ లకు వణుకు పుట్టిందనీ బీజేపీ అభ్యర్థి
ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం నిజామా బాదు నగరం లోని 6 వ డివి జన్ వినాయక నగర్ హను మాన్ జంక్షన్ నుంచి బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్య నారా యణ ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ లో పెద్ద ఎత్తున బిజెపికే మద్దతు పలుకుతున్నారని అర్బన్ లో కాషాయం జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజే పీ ఇచ్చినా మాట నిలబెట్టు కుంటుందన్నారు.

పసుపు బోర్డు ప్రకటన, అయోధ్య రామ మందిర నిర్మాణం.. నిన్నటి మేనిఫెస్టో లో డిగ్రీ విద్యార్థుల కు ఉచిత ల్యాప్ టాప్, వృద్దు ల్లకు ఉచిత కాశి, అయోధ్య యాత్ర, పుట్టిన ఆడపిల్లలకు 2లక్షల డిపాజిట్, ఉజ్వల యోజన వారికీ ఉచితంగా 4 సిలెండర్ లు, సంవత్సరానికి 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, ఇండ్లు లేని నిరుపేదలకు ఉచితంగా ఫ్లాట్స్, ఇండ్లు లేని వారికి పక్క ఇండ్లు ఇవ్వడం ఇవ్వన్ని చుసిన తరువాత పేదల కు ఒక నమ్మకం కలిగింద న్నారు. బీజేపీ మాట ఇచ్చిన తరువాత తప్పదన్నారు.ఉచిత విద్య, వైద్యం మీద ద్రుష్టి పెట్టాము అని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ లను ఓడించాలన్నారు. ఒక్కసారి బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే బీజేపీ అభివృధి చేసి చూపిస్తుందన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమన్ని కోరుకుం టుందన్నారు. ఒక్క నగరం లో కమలం పువ్వు కు ఓటేసి నన్ను భారీ మెజార్టీ తో గెలిపించాలని అన్నారు. ఈ సందర్బంగా కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మంగళ హారతులతో స్వాగతం పలికారు. కాలనీ సభ్యులు గజమాల తో సన్మానించారు. ఎటు చుసిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొ న్నారు ఈ కార్యక్రమం లో కొత్త వేణు, శ్రీనివాస్,ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, పంచారెడ్డి లింగం,న్యాలం రాజు,కార్పొరేటర్లు బంటు వైష్ణవి, పంచారెడ్డి లావణ్య,సుక్క మధు,వనిత శ్రీనివాస్, ప్రవళిక శ్రీధర్, ఇందిరా వినోద్, మాస్టర్ శంకర్, ఇల్లేందుల మమతా ప్రభాకర్, మెట్టు విజయ్, ఎర్రం సుదీర్,ఇప్పకాయల సుమిత్ర కిషోర్ ,నాగోళ్ళ లక్ష్మి నారాయణ బీజేపీ నాయకులు డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement