Tuesday, May 14, 2024

నిర్మల్ జిల్లాలో దొంగనోట్ల కలకలం.. ఇద్దరు అరెస్ట్..

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో దొంగనోట్ల కలకలం చోటుచేసుకుంది. దొంగనోట్లను తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భైంసాలో కొందరు వ్యక్తులు యూట్యూబ్ లో చూసి నకిలీ కరెన్సీని ప్రింట్ చేస్తున్నారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ కరెన్సీని తయారు చేస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరి వద్ద నుండి ప్రింటర్లు, ల్యాప్ టాప్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement