Monday, April 29, 2024

ప్రియురాలి మొజులో భార్యను హతమార్చిన‌ భర్తకు జీవిత ఖైదు..

నిర్మల్ జిల్లా కుభీర్​ మండలంలో ప్రియురాలి మొజులో పడి భార్యను హత్య చేసిన భర్తకు జిల్లా​ జీవిత ఖైదీ విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు లైజన్​ అధికారి సక్రియ నాయక్​ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా కుభీర్​ మండలంలోని గాలి సింగ్​ తండాకు చెందిన రాథోడ్​ మనీష్ కి… మీరాబాయితో వివాహాం జరిగింది. ఆ తర్వాత వీరిద్దరు భైంసాలోని ఓ రైతు వద్ద వ్యవసాయ కూలీ పని కోసం వచ్చారు. ఈ క్రమంలో పాండ్రిగల్లీకు చెందిన ఓ ఆమెతో మనీష్​కు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇరువురి విషయం భార్య మీరాబాయికి తెలియగా.. పంచాయతీ సైతం జరిగింది. ఈ పంచాయతీలో మీరాబాయితో పాటు ప్రేమికురాలిద్దరితో కలిసి ఉండాలని నిర్ణయించారు.

కొద్ది రోజుల తర్వాత ఇద్దరు భార్యల మధ్య గొడవలు జరుగగా.. రెండో భార్య, భర్త మనీష్​ ఇద్దరు కలిసి మొదటి భార్య మీరాబాయిని హతమార్చేందుకు ప్లాన్​ చేశారు. 2019 ఫిబ్రవరి 13న మొదటి భార్య మీరాబాయిని.. మనీష్ ఆమె గొంతు నలిమి హతమార్చారు. మృతురాలి తండ్రి దత్తురాం జాదవ్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు పోలీసులు. ఇక సాక్షాధారాల‌తో నేరం రుజువు కావడంతో జిల్లా న్యాయమూర్తి కర్ణకుమార్​ నిందితుడు రాథోడ్​ మనీష్​కు జీవిత ఖైదీతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు లైజన్​ అధికారి సక్రియ నాయక్​ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement