Sunday, May 19, 2024

అనారోగ్యంతో విద్యార్థి మృతి.. కుటుంబీకుల ఆందోళ‌న‌

ఆసిఫాబాద్ ‎లో గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని మృతి కలకలం రేపుతోంది. గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో బీజెడ్సీ రెండో సంవత్సరం చదువుతుంది.. అయితే.. గత రెండు రోజులుగా విద్యార్థిని విష జ్వరంతో బాధపడుతుంది. గురువారం పరిస్థితి విషమించడంతో కరీంనగర్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని మృతదేహంతో ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి ఎక్స్ గ్రేషియాతో పాటు ప్రభుత్వ ఉగ్యోగం ఇవ్వాలని విద్యార్థి సంఘాలు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement