Sunday, April 28, 2024

సిర్పూర్ నుంచి పోటీ చేస్తా.. ప్రకటించిన ఆర్ఎస్ ప్రవీణ్

కాగజ్ నగర్, (ప్రభన్యూస్): రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన కాగజ్ నగర్ పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా సిర్పూర్ ప్రాంతాన్ని ఆంధ్ర పాలకుల దోపిడీ నుండి విముక్తి కల్పించి తెలంగాణలో కలుపుతామని పేర్కొన్నారు. సిర్పూర్ ప్రాంతాన్ని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు, కాంట్రాక్టర్లు, కబ్జాదారులు, గుండాగిరి చేస్తూ కబలిస్తున్నారన్నారు.

బిల్లులు తీసుకుంటున్నారు కానీ, పనులు చేయడం లేదని, అందవెల్లి బ్రిడ్జి పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని విమ‌ర్శించారు. కాగజ్ నగర్ పేపర్ మిల్లుకు 13 రకాల రాయితీలిచ్చి లాభాలన్ని మింగుతున్నారని ఆరోప‌ణ‌లు గుప్పించారు. పొరుగు రాష్ట్రానికి చెందిన వారికి అధిక జీతమిచ్చి స్థానికులకు తక్కువ ఇస్తున్నార‌ని ప్ర‌వీణ్‌కుమార్‌ మండిపడ్డారు

Advertisement

తాజా వార్తలు

Advertisement