Sunday, April 28, 2024

ADB: ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన రిటర్నింగ్ అధికారి

ఉమ్మడి అదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) : లోక్ స‌భ‌ ఎన్నికల అనంతరం జూన్ 4న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజార్శి సందర్శించారు. కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా అక్కడ ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.


ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్, మీడియా సెంటర్ ఏర్పాటు వసతులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు భద్రతా పరమైన అంశాలను నిశితంగా పరిశీలించి ఆన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement