Thursday, April 25, 2024

ADB: అలక వీడిన రాథోడ్ రమేష్…

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్): బిజెపి సీనియర్ నేత, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఎట్టకేలకు అలక వీడి ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. అదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం ఆశించి భంగపడ్డ బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ పార్టీ కార్యక్రమాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఎంపీ టికెట్టును గోడం నగేష్ కు కేటాయించడంపై అసంతృప్తితో ఉన్న రాథోడ్ రమేష్ లంబాడాల తరఫున స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

పార్టీ అధిష్టానం రంగంలోకి దిగి నచ్చజెప్పడంతో పాటు శుక్రవారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బిజెపి ఎంపీ అభ్యర్థి గోడెం నగేష్ పార్టీ నేతలు ఉట్నూర్ లోని రాథోడ్ రమేష్ ఇంటికి వెళ్లి అల్పాహారం చేశారు. మున్ముందు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని పార్టీ పెద్దలు నచ్చజెప్పడంతో గొడెం నగేష్ తో కలిసి బిజెపి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అంగీకరించారు. అయితే సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు మాత్రం తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలో ఉంటానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉంటున్న బాపురావును ఢిల్లీ పెద్దలు బుజ్జగిస్తున్నట్టు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement